ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. విలీనంపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పట్టుదల, కసి మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. విజయవాడ ఆర్టీసీ ఆస్పత్రిలో కేశినేని నాని.. ఎంపీ నిధులతో నిర్మించిన వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. నిర్ణీత సమయంలోనే ఆర్టీసీ ప్రభుత్వ రవాణాగా సంస్థగా మారుతుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలతో కసి పెరిగింది: మంత్రి పేర్ని నాని
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. విలీనంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యతో పట్టుదల, కసి మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు.
minister perni Nani counter to CM KCR comments on RTC murge in governament