ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి - జల వివాదాలపై స్పందించిన నిరంజన్​రెడ్డి

కృష్ణాజలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఆ రాష్ట్ర మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అంత సులువు కాదని తెలిపారు.

niranjan reddy allegations on opposition
నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి

By

Published : Aug 5, 2020, 12:15 AM IST

నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి

కృష్ణాజలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని... ఆ రాష్ట్ర మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు తరలించుకుపోతుంటే కావలి కాసిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనను ఇప్పటికే పలు వేదికలపై వినిపించామన్న ఆయన... వాళ్లు కావాలన్నప్పుడే వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అంత సులువు కాదని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయన్న మంత్రి... కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే మొత్తం పూర్తయ్యేదని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details