రాష్ట్ర ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం... ఆబ్కారీ శాఖ పరంగా రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖ పరంగా రూ.4500 కోట్లు మొత్తం రూ.6000 కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందని చెప్పారు.
అయినప్పటికీ తమ ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. బయట అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. అన్ని బార్లు, షాపుల్లోని స్టాకును పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని దిశా నిర్దేశం చేశారు.