హైదరాబాద్లో విద్యార్థుల అవస్థను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్లోని హాస్టళ్లు, మెస్ల మూసివేత, ఏపీ విద్యార్థుల అగచాట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్తో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని.. వారికి రవాణా ఇబ్బందులు వస్తాయన్నారు. ఒకచోట నుంచి ఇంకో చోటకు కదలడం శ్రేయస్కరం కాదని మంత్రి బొత్స తెలిపారు. ఇదే అంశాలను ఏపీ సీఎస్.. తెలంగాణ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు ప్రత్యేకంగా పాసులు ఇస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు.
కేటీఆర్ స్పందన