ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 4:33 PM IST

ETV Bharat / city

'పెయిడ్​ ఆర్టిస్టుల నుంచి తప్ప మరెక్కడా స్పందన లేదు'

అమరావతి ఉద్యమంపై చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పెయిడ్​ ఆర్టిస్టుల నుంచి తప్ప మరెక్కడా స్పందన లేదని మంత్రి బొత్స విమర్శించారు. రాజధాని పేరుతో తెదేపా నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం లేదన్నారు.

minister  botsa satyanarayana
minister botsa satyanarayana

అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్భంగా ఊరేగింపులు, ధర్నాలు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారని.. కేవలం పెయిడ్ ఆర్టిస్టుల నుంచి తప్ప మరెక్కడా స్పందన లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు.

13 జిల్లాల్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్నారు. 3 రాజధానులను ప్రజలందరూ హర్షిస్తున్నారని చెప్పారు. రాజధాని పేరుతో తెదేపా నేతలు భూములు దోచుకున్నారని... వైకాపా ప్రభుత్వంలో అలాంటి దోపీడికి తావు లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details