హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా...కానిస్టేబుల్ మృతి - మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి కారు ప్రమాదం వార్తలు
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ పేలటంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
![హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా...కానిస్టేబుల్ మృతి minister balneni srinivas reddy car accident at hyderabad orr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7925586-346-7925586-1594105929463.jpg)
మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి కారు బోల్తా
తెలంగాణ రాష్ట్రం రాచకొండ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ పేలి బొలెరో వాహనం బోల్తాపడింది. వాహనంలో ఉన్న పాపారావు అనే కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్నగర్లోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన జరిగింది.
TAGGED:
accident at hyd