ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై మంత్రి అనిల్ సమీక్ష

By

Published : Dec 29, 2020, 4:32 PM IST

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

minister anil kumar
minister anil kumar

పోలవరంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2021 ఏప్రిల్ నెల నాటికి పోలవరం స్పిల్ ఛానల్​లో ఎర్త్ వర్క్​, కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించే సమావేశంలో ప్రాజెక్టులో చేపట్టనున్న గేట్ల బిగింపు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్​కు సంబంధించిన పనులపై వివరాలు తెలియజేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిర్వాసితులకు అందించే పునరావాస పరిహారానికి సంబంధించిన వివరాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details