వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. విశాఖ నుంచి పాలన: మంత్రి అమర్నాథ్ - undefined

16:40 September 16
రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత: అమర్నాథ్
Minister Amarnath on Three Capitals: వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలను తెదేపా నిరూపించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని ప్రశ్నించారు. విశాఖలో రాజధానికి ప్రైవేట్ భూమి సెంటు కూడా తీసుకోలేదని తెలిపారు. రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత వహించాలని మంత్రి అమర్నాథ్ సూచించారు.
ఇవీ చదవండి: