ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నిమ్మగడ్డ వ్యాఖ్యలు.. ఆయన వ్యవహార శైలికి విరుద్ధం'

By

Published : Mar 31, 2021, 5:51 PM IST

గవర్నర్‌కు ఎస్‌సీఈ నిమ్మగడ్డ రాసిన లేఖపై మంత్రి పేర్ని విమర్శలు చేశారు. రాజకీయపార్టీలు ఎస్‌ఈసీతో సంబంధం లేకుండా ఉండాలని లేఖలో రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ మాత్రం రాజకీయ నేతలతో రహస్యంగా భేటీ అవుతారని ఆరోపించారు.

miniser perni nani comments on sec nimmagadda
miniser perni nani comments on sec nimmagadda

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పదవీకాలంలో చివరిరోజున గవర్నర్​కు రాసిన లేఖలో.. చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎస్​ఈసీ ఉండాలన్న మాటలు.. ఆయన వ్యవహారశైలికి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. రాజకీయనేతలతో నిమ్మగడ్డ భేటీ అయ్యి.. అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని పేర్ని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details