ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 4, 2020, 3:07 PM IST

ETV Bharat / city

హైదరాబాద్​లో ఈనాడు ప్రాపర్టీ షో.. ప్రారంభించిన మెట్రో ఎండీ

రియల్​ ఎస్టేట్​లో హైదరాబాద్​ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మెట్రో రైల్ ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి తెలిపారు. ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించారు.

metro-md-nvs-reddy-starts-eenadu-property-show
metro-md-nvs-reddy-starts-eenadu-property-show

హైదరాబాద్​లో ఈనాడు ప్రాపర్టీ షో

హైదరాబాద్‌ను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అక్కడి మెట్రో రైల్‌ ఎండీ ఎన్​వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనాడు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు.

స్థిరాస్తి వ్యాపారం దేశమంతటా తిరోగమనంలో ఉన్నా... హైదరాబాద్‌లో మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని ఎన్​వీఎస్ రెడ్డి వివరించారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా హైదరాబాద్​ అభివృద్ధి కేంద్రంగా మారే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details