తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కాసేపట్లో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకోనున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు కూడా అవసరమని వైద్యులు నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.