ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నోట్లను ఉతికి.. ఇస్త్రీ చేశారు!

By

Published : Feb 19, 2020, 11:27 PM IST

తెలంగాణలో అక్కడ డబ్బులను ఉతికేస్తున్నారు. ఆరేస్తున్నారు. శుభ్రంగా కడిగి.. ఇస్త్రీ చేస్తున్నారు. డబ్బులను ఉతికేయడమేంటీ అనుకుంటున్నారా..? అవును.. మేడారం జాతర హుండీ లెక్కింపులో అధికారులు అనుసరిస్తోన్న పద్ధతి డబ్బులను ఉతికేయడమే.

నోట్లను ఉతికి.. ఇస్త్రీ చేశారు!
నోట్లను ఉతికి.. ఇస్త్రీ చేశారు!

మేడారం జాతర లెక్కింపు అధికారులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..!

తెలంగాణలోని మేడారం జాతర హుండీలో వాన నీటితో తడిసి పోయిన నోట్ల లెక్కింపు కష్టంగా మారుతోంది. వాటన్నింటినీ సిబ్బంది ఒక చోటుకు చేర్చి.. శుభ్రంగా కడిగి.. ఇస్త్రీ చేసి లెక్కిస్తున్నారు. కొన్ని నోట్లు చిరిగి రెండు ముక్కలయ్యాయి. సాధ్యమైనంతవరకూ నోట్లను బాగు చేసి లెక్కిస్తున్నామని.. ఇక వీలుకాని పరిస్థితిలో రిజర్వ్ బ్యాంకుకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.

తడిసిముద్దైన ఒడిబియ్యం

సమ్మక్క-సారలమ్మలకు సమర్పించిన ‍ఒడిబియ్యం కూడా తడిసి ముద్దవడం వల్ల కుప్పలుగా పోసి ఆరబెట్టారు. జాతర ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 1980లో నాలుగు లక్షల యాభై వేల ఆదాయం రాగా.. 1990లో అది 24 లక్షల 90 వేలకు చేరింది. 2010లో నాలుగు కోట్ల మేర ఆదాయం రాగా.. రెండేళ్ల క్రితం జరిగిన జాతరలో పది కోట్ల మేరకు హుండీ ఆదాయం పెరిగింది. ఇక ఈసారి ఇప్పటికే పదిన్నర కోట్ల మేర ఆదాయం దాటిందని... బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు కూడా జరుగుతోందని... మరో రెండు మూడు రోజుల్లో మొత్తం హుండీ లెక్కింపు పూర్తి కానుందని చెబుతున్న డబ్బు, బంగారం లెక్కింపు ఇంఛార్జీలు నర్సింహులు, అంజనీ కుమారితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...!

ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి

ABOUT THE AUTHOR

...view details