ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2020, 4:55 PM IST

ETV Bharat / city

ఎంసీఏ కోర్సు వ్యవధి కుదింపు.. విద్యాశాఖ ఉత్తర్వులు

ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని కుదిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సతీష్​చంద్ర ఆదేశాలు జారీ చేశారు.

ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని కుదిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని కుదిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు


ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సు వ్యవధి కాలాన్ని కుదిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఏ కోర్సును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు ఆ శాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఆదేశాలు ఇచ్చారు.

గణితం చదివి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ సైన్సు, కామర్స్, ఆర్ట్స్ పట్టభద్రులకు ఎంసీఏ కోర్సును రెండేళ్లకు మాత్రమే పరిగణించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 2021 ఆర్ధిక సంవత్సరం నుంచి కొత్త కరికులమ్ అమలు చేయాల్సిందిగా విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details