తెలంగాణలో ఇప్పటికే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం పూట మాడు పగిలేలా ఎండలు దండి కొడుతున్నాయి. ఈ క్రమంలో... రాష్ట్రంలో ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి రెండు ప్రదేశాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరగనున్నాయని తెలిపింది.
తెలంగాణలో ఈరోజు, రేపు వడగాల్పులు... ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు - తెలంగాణలో అత్యధిక ఉష్టోగ్రతలు
తెలంగాణలో భానుడు రోజురోజుకు మండిపోతున్నాడు. నిప్పులు కక్కుతూ... జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అత్యధిక ఉష్టోగ్రతలు నమోదు చేస్తూ... బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
![తెలంగాణలో ఈరోజు, రేపు వడగాల్పులు... ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు maximum-temperatures-in-telangana-on-tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11265157-663-11265157-1617449311925.jpg)
తెలంగాణలో ఈరోజు, రేపు వడగాల్పులు... ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ఈరోజు, రేపు... తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట్ జిల్లాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.