ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 6, 2020, 11:13 AM IST

Updated : Apr 6, 2020, 1:01 PM IST

ETV Bharat / city

కరోనా ప్రభావం: పోరాటానికి తాత్కాలిక విరామం

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో పోలీసులపై ఎటువంటి దాడులకు దిగబోమని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు మల్కన్​గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ కార్యదర్శి కైలాసం ఓ ఆడియో టేపును విడుదల చేశారు.

maoist party sensational statement on shooting
maoist party sensational statement on shooting

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మల్కన్​గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ (ఎంకేవీ) కమిటీ కార్యదర్శి కైలాసం ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా కరోనాతో అధిక సంఖ్యలో మరణాలు సంభివిస్తున్నాయని.. వేలాది మంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. వైరస్​ను నిరోధించడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నానికి ఆటంకం కలిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధానంగా ఈ విపత్కర సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి గానీ పిఎల్​జిఏ, అనుబంధ సంస్థల నుంచి పోలీసులపై ఎటువంటి దాడులకు పూనుకోమని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల నుంచి తమ నిర్ణయానికి భిన్నంగా కార్యచరణ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిఘటించక తప్పదని కైలాసం స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరిని ఐదు రోజుల్లో తెలియపరచాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రా - ఒడిశాలో ప్రజలకు ఇస్తున్న నిత్యావసర సరుకులు ఏ మాత్రం సరిపోవటం లేదని...మరిన్ని సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు.

Last Updated : Apr 6, 2020, 1:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details