తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంత పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసగుప్ప వద్ద 4 రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
బూటకపు ఎన్కౌంటర్ అంటూ లేఖ..
ఇవి ఎదురుకాల్పులు కాదని.. బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గుండాల మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శంకర్ను కావాలనే ఎన్కౌంటర్ చేశారని లేఖలో పేర్కొన్నారు.