ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదు... పీపీఈ కిట్లు'

By

Published : Aug 15, 2020, 8:37 PM IST

సీఎం జగన్​పై ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదని... పీపీఈ కిట్లనే సంగతి గ్రహించాలని హితవు పలికారు. వైద్యుడు సుధాకర్​కి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

Manthena Satyanarayana Raju Comments On jagan Over Independence day speech
సత్యనారాయణరాజు ట్వీట్

సత్యనారాయణరాజు ట్వీట్

స్వాతంత్య్ర దినోత్సవం రోజుల ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగంపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శలు గుప్పించారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదు, పీపీఈ కిట్లనే సంగతి జగన్ రెడ్డి గ్రహించాలని హితవు పలికారు.

కిట్లు అడిగిన పాపానికి ఫ్రంట్ లైన్ వారియర్స్​ని కూడా చితకబాదిన సంగతి మర్చిపోయారా అంటూ... వైద్యుడు సుధాకర్​కి సంబంధించిన వీడియోను సత్యనారాయణరాజు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details