'అమరావతి కోసం రాష్ట్రమంతా పోరాడాలి' - అమరావతి కోసం మందడం రైతుల ఆందోళన
అమరావతి కోసం రాష్ట్రమంతా పోరాడాల్సిన అవసరముందని మందడం రైతులు విజ్ఞప్తి చేశారు. ఇది తమ 29 గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. 5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు. అమరావతి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉందని.. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని అన్నారు. అందరూ అమరావతికి అండగా ఉండాలని కోరారు.
అమరావతి కోసం మందడం రైతుల ధర్నా