ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 3, 2020, 10:20 AM IST

ETV Bharat / city

తెలంగాణ: కోతుల దాడిలో వ్యక్తి మృతి

కోతులు చేసిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్​లో జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తిపై కోతులు గుంపుగా వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అతను భవనంపై నుంచి పడి తీవ్రగాయాలపాలయ్యాడు.

one died in monkeys attack
కోతుల దాడిలో వ్యక్తి మృతి

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ పట్టణంలోని కంకరబోడ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మాజహర్‌ భవన నిర్మాణ పనులు చేసేవాడు. సోమవారం కలెక్టరేట్‌ సమీపంలోని ఓ భవనంలో పని చేస్తుండగా కోతుల గుంపు ఒక్కసారిగా అతడి వైపు వచ్చాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో అతను అదుపు తప్పి భవనంపై నుంచి కిందపడిపోయాడు.

తీవ్రగాయాలైన అతనిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య గర్భిణి కాగా... బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:ప్రియురాలి ఇంటికి నిప్పుపెట్టిన ప్రియుడి కుటుంబ సభ్యులు!

ABOUT THE AUTHOR

...view details