తెలంగాణలో ప్రేమ ఫలించలేదని రెండు జంటల ఆత్మహత్య తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లింగారెడ్డి గూడలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెంది యువ జంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పల్లవి (19), ఆశమల్ల మహేందర్ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అంగీకరించరేమోనని మనస్తాపానికి గురై.. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దలు అంగీకరించలేదని
మరోవైపు కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుశీల (20) అనే యువతి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే మనస్తాపంతో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు శ్రీరాములు(25) సైతం పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కోన వెంకటేశ్వర్లు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష