ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అలా ఉండాలంటే ఇంటి పరిధిలోనే వేడుకలు చేసుకోండి'

By

Published : Mar 25, 2020, 11:15 AM IST

తెలుగు ప్రజలకు తెదేపా నేతలు నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిధిలోనే ఉగాది వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

lokesh ugadi wishes to telugu people
lokesh ugadi wishes to telugu people

లోకేశ్ ట్వీట్

తెలుగు ప్రజలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంతా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే.. కరోనాకు చిక్కకుండా ఎవరికి వారు.. ఇంటి పరిధిలోనే ఉగాదిని జరపుకోవాలంటూ ట్వీట్ చేశారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి

మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రూపంలో దేశం ప్రళయాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రధాని మోదీ మనందరిని చేతులెత్తి వేడుకున్నారని గుర్తు చేశారు. అయ్యప్పమాల, రంజాన్ ఉపవాసాల తరహాలో ఈ ఉగాదికి 21 రోజుల లాక్​డౌన్ దీక్ష చేద్దామని పిలుపునిచ్చారు.

సోమిరెడ్డి ట్వీట్

ABOUT THE AUTHOR

...view details