'ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరు' - వైకాపా ప్రభుత్వంపై లోకేశ్
ప్రజల్లో వైకాపా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరని నారా లోకేశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుతున్నాయని ఆరోపించారు.
!['ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5084339-264-5084339-1573902040936.jpg)
వైకాపా ప్రభుత్వంపై లోకేశ్
ముఖ్యమంత్రి జగన్ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరాయని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా తిమ్మారెడ్డిపాలెంలో ఓ మహిళ ఇంటి ముందు కట్టిన గోడ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఎవరూ ఆపలేరని లోకేశ్ పేర్కొన్నారు.