ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 10, 2020, 1:18 PM IST

ETV Bharat / city

'అమరావతి... భారత్​- పాక్​ సరిహద్దును తలపిస్తోంది'

అమరావతిలో సీఎం జగన్​ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని సూచించారు.

lokesh on amaravathi issue
వైకాపా ప్రభుత్వం పై నారా లోకేశ్​ వ్యాఖ్యలు

రాజధాని ప్రాంతాలు... భారత్‌-పాక్‌ సరిహద్దును తలపిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ విమర్శించారు. అక్కడైనా ఇంత మంది పోలీసులు ఉండరని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలని లోకేశ్‌ ట్విట్టర్‌లో సూచించారు.

అమరావతిలో బందోబస్త్​పై నారా లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details