ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH LETTER: ఎయిమ్స్ నీటి సమస్య పరిష్కరించండి: సీఎంకు లోకేశ్ లేఖ

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్​కు లేఖ రాశారు. మంగళగిరి ఎయిమ్స్​కి నీటి సరఫరా సమస్య ఉందని.. దానిని పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

By

Published : Aug 26, 2021, 7:13 AM IST

lokesh letter to jagan
lokesh letter to jagan

మంగళగిరి ఎయిమ్స్​కి నీటి సరఫరా జాప్యంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. ఎయిమ్స్ మంగళగిరికి నీటి సరఫరా సమస్య పరిష్కారం అత్యవసరమని పేర్కొన్నారు. ఎయిమ్స్​కు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి 2017లో 10 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఆమోదించారని.. 2018లో పాలనాపరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయని గుర్తు చేశారు. గత రెండేళ్ల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు.

ఎయిమ్స్​కి కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నీటి కొరత కారణంగా కొవిడ్ పోరాటంలో ముందుండాల్సిన ఎయిమ్స్ వెనుకబడిందన్నారు. ఎయిమ్స్ ఏపీతో పాటు దక్షిణ భారతదేశంలోనే ప్రజలకు ఉత్తమ సేవలందించే ప్రతిష్టాత్మక రెండు సంస్థలో ఒక్కటని.. ప్రభుత్వం ఎయిమ్స్​ను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మంగళగిరి లేదా తెనాలి కాలువ ద్వారా పైప్‌లైన్‌తో నీటి సరఫరా సమస్యను పరిష్కరించమని ఎయిమ్స్ డైరెక్టర్ ఇప్పటికే సీఎంను కోరారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:JAGANA TOUR: కుటుంబ సమేతంగా సీఎం షిమ్లా పర్యటన

ABOUT THE AUTHOR

...view details