ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ అవినీతి గురించి మాట్లాడితే చంపేస్తారా..? : లోకేశ్‌ - ప్రొద్దుటూరులో తెదేపా నేత హత్య వార్తలు

ప్రశాంతంగా ఉన్న సీమలో వైకాపా నేతలు రక్తం పారిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. చేనేత‌ వ‌ర్గం నాయ‌కుడిని కిరాతకంగా హత్య చేశారన్నారు. ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై అధికార గర్వాన్ని అణిచివేస్తారని దుయ్యబట్టారు. అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా? అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు.

lokesh-comments
lokesh-comments

By

Published : Dec 30, 2020, 9:49 AM IST

Updated : Dec 30, 2020, 12:31 PM IST

ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య హత్య ఘటనను.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న సీమలో నెత్తురు పారిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అండతో దుండగులు పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు.

ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై అధికార గర్వాన్ని అణిచివేస్తారని హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యే అవినీతిని బయట పెట్టినందుకే కక్ష గట్టి చేనేత వర్గం నాయకుడు సుబ్బయ్యపై దాడికి ఒడిగట్టారని మండిపడ్డారు. అన్యాయంగా నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంతో ఆ పిల్లలకు తండ్రిని తేగలరా అని నిలదీశారు.

Last Updated : Dec 30, 2020, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details