ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ. 4 కోట్ల విరాళం - నాడు నేడులో నాలుగు మండలాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం లారస్ ల్యాబ్స్ విరాళం

తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు.. లారస్ ల్యాబ్స్ రూ. 4 కోట్లు విరాళమిచ్చింది. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సీఎం సహాయనిధికి సంస్థ అందజేసింది. అవే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో.. రెండో, మూడో విడత నాడు - నేడుల్లో సొంతగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

laurus labs donation to cm welfare fund
సీఎం జగన్​కు విరాళం అందిస్తున్న లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు

By

Published : Feb 10, 2021, 9:19 PM IST

ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ రూ. 4 కోట్ల భారీ విరాళం అందించింది. మొదటి విడత నాడు - నేడులో భాగంగా.. 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని ఇచ్చింది. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.

రెండో, మూడో విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో.. సొంతగా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు వెల్లడించారు. చెక్కు సహా సంబంధిత పత్రాలను సంస్థ ఉపాధ్యక్షుడు చావా నరసింహరావు, సీనియర్‌ మేనేజర్‌ రామకృష్ణ.. సీఎం జగన్​కు అందించారు. కనెక్ట్‌ టు ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details