ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు

రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు. మార్చి 31 నాటికి నీటిని కేటాయించేందుకు కేఆర్​బీఎం అనుమతినిచ్చింది.

By

Published : Feb 12, 2021, 6:19 PM IST

krishna
krishna

తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్​కు 92.50 టీఎంసీలు, తెలంగాణకు 82.02 టీఎంసీలు కేటాయించింది. మార్చి 31 నాటికి నీటిని కేటాయించేందుకు కేఆర్​బీఎం అనుమతినిచ్చింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు.

ఆంధ్రప్రదేశ్​కు శ్రీశైలం ప్రాజెక్ట్​ నుంచి 27.90 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 64.60 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 17.92 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 65 టీఎంసీల విడుదలకు అనుమతినిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details