లాక్డౌన్ ప్రభావంతో నిలిచిపోయిన కృష్ణా ఎక్స్ప్రెస్ తిరిగి పట్టాలెక్కనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభం కానుంది. దాదాపు 10 నెలల విరామం అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు నడిచే ఈ రైలు... మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ ప్రయాణికులతో పాటు మహారాష్ట్ర వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. అటు తిరుపతి, ఇటు ఆదిలాబాద్ నుంచి ఈ రైలు నిత్యం ప్రయాణికులకు అందుబాటులో రానుంది.
ఇప్పటివరకు పండగ ప్రత్యేక రైళ్లుగా నడిపిన మరో నాలుగు జతల రైళ్లను 27, 28, 29 తేదీల నుంచి ప్రత్యేక రైళ్లుగా నడపనుంది. వీటిలో సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లు ప్రయాణికులు అందుబాటులోకి రానున్నాయి.