ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 15, 2020, 10:45 AM IST

ETV Bharat / city

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.

koil alwar thirumanjanam seva
koil alwar thirumanjanam seva

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురష్కరిచుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది.

వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం.. శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపిన పవిత్ర జలంతో ప్రదక్షణగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

ఇదీ చదవండి:

నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!

ABOUT THE AUTHOR

...view details