'రాజధానిని అంగుళం కూడా కదపలేరు' - అమరావతిపై కేశినేని నాని
అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదపలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులను ఆయన పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం మండలిని రద్దు చేయలేదన్నారు. సీఎం జగన్ కావాలంటే ఇడుపులపాయ నుంచి పరిపాలన చేసుకోవచ్చని వ్యంగ్యంగా అన్నారు.