'వైకాపా పాలనలో ప్రతిపక్షాలకు రక్షణ ఏది?' - వైకాపా శ్రేణుల దాడిపై కన్నాలక్ష్మీనారాయణ ట్వీట్
వైకాపా రాక్షస పాలనలో ప్రతిపక్షాలకు రక్షణ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా దాడులపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. పులిచెర్లలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థిపై వైకాపా దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. భాజపా కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికల్లో నిలబడాలని సూచించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.
వైకాపా శ్రేణుల దాడిపై కన్నాలక్ష్మీనారాయణ ట్వీట్