ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 29, 2020, 9:02 PM IST

ETV Bharat / city

'వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వండి'

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వాలని కోరారు. ఇలాంటి వాతావరణం వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు.

Kanna Laxminarayana letter to cm jagan
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వెయిటింగ్‌లోని ఉద్యోగులు, పోలీసులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జీతాలు రాక వెయిటింగ్‌లో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 మంది డీఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు పోస్టింగ్‌ లేకుండా ఉన్నారన్న కన్నా... 150 మంది ఎస్‌ఐలు, 120 మంది సీఐలు పోస్టింగ్‌ లేకుండా ఉన్నారని వివరించారు. ఇంతమందిని విధులకు దూరంగా ఉంచడం శాంతిభద్రతలకూ ఇబ్బందేనని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణం వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details