రాజధాని మార్పును నిరసిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న రైతులు, ప్రజలకు ఆధ్యాత్మిక వేత్త కమలానంద భారతి సంఘీభావం ప్రకటించారు. రాజధాని అమరావతిపై అసలు చర్చలు, కమిటీలు అవసరం లేదని ఆయన తెలిపారు. ఆరోజు అందరి అంగీకారంతోనే అమరావతికి శంకుస్థాపన చేశారన్న అయన ఆరోజు ఎవరు అడగారని అమరావతిని రాజధానిగా ప్రకటించారని ప్రశ్నించారు. అమరావతిని అడ్డుకోవాలనుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.
'అమరావతికి అడ్డుకోవాలని చూస్తే రాజకీయ భవిష్యత్ ఉండదు' - కమలానంద భారతి తాజా న్యూస్
రాజధాని అమరావతిని అడ్డుకోవాలనుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆధ్యాత్మిక వేత్త కమలానంద భారతి అన్నారు. ప్రజల భద్రత, జీవితం అమరావతితోనే ముడిపడి ఉందని స్పష్టం చేశారు. మందడంలో ఆందోళన చేస్తోన్న రైతులకు సంఘీభావం తెలిపారు.

'అమరావతికి విఘ్నం కలిగిస్తే... రాజకీయ భవిష్యత్ ఉండదు'
రాజధాని రైతుల ఆందోళనకు కమలానంద భారతి మద్దతు
Last Updated : Dec 22, 2019, 6:48 PM IST