ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భూకుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలి' - భూ అక్రమాలపై కళా వెంకట్రావు

రాష్ట్రంలో భూ కుంభకోణం పెద్ద ఎత్తున జరుగుతోందంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ జడ్జితోనో, సిట్టింగ్ జడ్జితోనో విచారణ కమిటీకి ఆదేశిస్తే.. భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

kala venkat rao wrote letter to cm on land scams
కళా వెంకట్రా

By

Published : Sep 3, 2020, 10:49 AM IST

రాష్ట్రంలో భూకుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే.. సాక్ష్యధారాలతో అక్రమాలను నిరూపిస్తామన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వైకాపా నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఈ అవకతవకలపై వైకాపా నాయకులే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు.

సఖల భోగాలతో జిల్లాకో రాజప్రసాదం నిర్మించుకొంటున్న పాలకులు.. పేదలను మాత్రం శ్మశానాలు, ముంపు ప్రాంతాలలో ఇళ్లు కట్టుకోమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చోట వైకాపా నేతలు ఇళ్లు క‌ట్టుకోగలరా అని కళా నిలదీశారు. పశువుల మేత భూముల్లో నివాసాలకు స్థలాలు ఎలా ఇస్తారని హైకోర్టు ఆక్షేపించినా తీరు మారలేదన్నారు.

గత తెదేపా ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు పంచకుండా శిథిలావస్థకు చేరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంపిణీ చేసిన భూమిని జగన్ సర్కార్ లాక్కుందని ద్వజమెత్తారు.

ఇదీ చదవండి: గ్రామాల్లో నిలిచిపోతున్న పంట కోతలు

ABOUT THE AUTHOR

...view details