ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్​ అవినీతిపై ఐఐఎం అధ్యయనం చేయాలి' - వైకాపా పై కళా వెంకట్రావు

సీఎం జగన్​ అవినీతిపై ఐఐఎం అధ్యయనం చేయాలని కళా వెంకట్రావు లేఖ రాశారు. సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి వేల కోట్ల రూపాయలు వాటిలోకి మళ్లించారని లేఖలో విమర్శించారు.

జగన్​పై కళా వెంకట్రావు

By

Published : Nov 25, 2019, 7:32 PM IST

జగన్​పై కళా వెంకట్రావు

సీఎం జగన్ అవినీతిపై అధ్యయనం చేయాలని కోరుతూ.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అహ్మాదాబాద్ ఐఐఎంకు బహిరంగ లేఖ రాశారు. జగన్‌పై 31 క్రిమినల్‌ కేసులతోపాటు, సీబీఐ విచారణ సాగుతోందన్నారు. సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి వేల కోట్ల రూపాయలు వాటిలోకి మళ్లించారని లేఖలో పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, మద్యం, మైనింగ్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఐఐఎంకు రాసిన లేఖలో వివరించారు. ఐఐఎం అధ్యయనానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details