ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిబ్రవరి 28 నుంచి 'జగనన్న విద్యా వసతి దీవెన' - Jagan schemes

వచ్చే నెల 15 నుంచి కొత్త పింఛను, బియ్యం కార్డులు పంపిణీ చేస్తామని సీఎం జగన్ వివరించారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు మంజూరు చేస్తామని ఉద్ఘాటించారు. వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... గ్రామాల్లో ఇంటిస్థలం లేదనే పరిస్థితి ఎవరికీ రాకూడదని.. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉండేవారిపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాతే వారిని తరలించాలని స్పష్టం చేశారు.

Jagan Review on Education
ఫిబ్రవరి 28 నుంచి జగనన్న విద్యావసతి దీవెన

By

Published : Jan 28, 2020, 5:42 PM IST

Updated : Jan 28, 2020, 7:29 PM IST

ఫిబ్రవరి 28 నుంచి జగనన్న విద్యావసతి దీవెన

ఫిబ్రవరి 28న 'జగనన్న విద్యా వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కంటివెలుగులో భాగంగా ఫిబ్రవరి 1నుంచి మూడో విడత కార్యక్రమం నిర్వహించనున్నట్టు పలు అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు.

సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్

ఫిబ్రవరిలో 4,906 కొత్త ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. అమ్మఒడిలో లక్షా 7 వేల మందికి నగదు బదిలీ కాలేదని గుర్తించామని సీఎం జగన్ వివరించారు. వారికి వెంటనే నగదు అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు.

ఈ నెల 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభించనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలులో ఇసుక డోర్‌ డెలివరీ చేసేలా ఆదేశాలిచ్చారు. వర్షాకాలం వచ్చేసరికి 60 నుంచి 70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కువైట్​లో చిక్కుకున్న మహిళలకు విముక్తి

Last Updated : Jan 28, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details