ఫిబ్రవరి 28న 'జగనన్న విద్యా వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కంటివెలుగులో భాగంగా ఫిబ్రవరి 1నుంచి మూడో విడత కార్యక్రమం నిర్వహించనున్నట్టు పలు అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు.
ఫిబ్రవరిలో 4,906 కొత్త ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. అమ్మఒడిలో లక్షా 7 వేల మందికి నగదు బదిలీ కాలేదని గుర్తించామని సీఎం జగన్ వివరించారు. వారికి వెంటనే నగదు అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు.