ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్ పెన్నా కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వాయిదా

By

Published : Sep 1, 2021, 5:16 PM IST

Updated : Sep 1, 2021, 7:50 PM IST

JAGAN CBI CASES
JAGAN CBI CASES

17:13 September 01

JAGAN CBI CASES

సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల(JAGAN CBI CASES) విచారణ నేడు జరిగింది. పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ఈ కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై వాదనలను ఈ నెల 6కు వాయిదా వేసింది. దీనితోపాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి సబిత, శామ్యూల్, రాజగోపాల్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల వాదనలను సైతం వాయిదా వేసింది.

ఈడీ కేసుల విచారణపై సుప్రీంకు వెళ్తామన్న ఎంపీ విజయసాయి.. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డి(MP VIJAYASAI REDDY) అభ్యర్థనపై తమకు అభ్యంతరం లేదని ఈడీ కోర్టుకు తెలపడంతో విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. వీటితోపాటు ఎమ్మార్ విల్లాల విక్రయాలపై సీబీఐ, ఈడీ కేసుల విచారణను 15కు ధర్మాసనం వాయిదా వేసింది.

సీబీఐ కోర్టులో సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్​ దాఖలు..

అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోరుతూ.. సీఎం జగన్‌ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదన్న ఆయన.. ఛార్జ్‌షీట్‌ నుంచి తొలగించాలని కోరారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికీ డిశ్చార్జి పిటిషన్లు వేయని నిందితులకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ న్యాయస్థానం విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: 

CM JAGAN: గ్రామ సచివాలయాల్లో 2,038 పోస్టుల భర్తీకి సీఎం జగన్​ అంగీకారం

Last Updated : Sep 1, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details