హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావుతోపాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలు తోటి మిత్రులతో పంచుకున్నారు. తమ కళాశాలలో సినీ దర్శకుడు కే.విశ్వనాథ్, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ గవర్నర్ రోశయ్య, పలువురు రాజకీయ ప్రముఖులు చదువుకున్నారని గుంటూరు పూర్వ విద్యార్థుల సంఘం తెలిపింది. గురువులు చెప్పిన సలహాలు, సూచనలు కొన్ని మాత్రమే అమలు చేశానని... పూర్తిగా అమలు చేస్తే బాగుండేదని రోశయ్య పేర్కొన్నారు.
గురువుల సలహాలన్నీ పాటిస్తే బాగుండేది: రోశయ్య - పలువురు రాజకీయ ప్రముఖులు
గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవనంలో ఘనంగా జరిగింది. కళాశాల పూర్వ విద్యార్థులైన... తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య,హెచ్సీయూ వీసీ అప్పారావు ముఖ్య అతిథిలుగా పాల్గొని తమ జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్నారు.
గురువులు చెప్పిన సలహాలన్నీ పాటిస్తే బాగుండేది: రోశయ్య