ఆలయాల దాడుల అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ థాస్తో పాటు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దాడులకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు. కృష్ణా, రాజమండ్రిలో జరిగిన ఘటనలు ఒకే ఎలక్ట్రిక్ రంపం వినియోగించినట్లు ఆధారాలున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో దేవాలయాలపై మొత్తం 388 దాడులు జరిగాయి. ఇందులో విగ్రహల ధ్వంసం పరంగా చూస్తే.. 2019లో - 6 , 2020లో -29, 2021లో 3 నమోదయ్యాయి. ఈ ఘటనలన్నింటీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. సెప్టెంబర్ 5 తరువాత జరిగిన ఘటన కేసులకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సరైన సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకుంటాం - రవిశంకర్ అయ్యన్నార్ , శాంతిభద్రతల ఏడీజీ