రాష్ట్రంలో భూములపై శాశ్వత హక్కు కల్పించడమే లక్ష్యంగా సమగ్ర సర్వే చేపడుతున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. భూముల రీసర్వే ప్రాజెక్టుపై అధికారులతో గురువారం సమీక్షించిన ముఖ్యమంత్రి... 2021 జనవరి 1 నుంచి ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 22 వేల చదరపు కిలోమీటర్లలో చేపట్టనునన్న సమగ్ర సర్వేను వీలేనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు. వందేళ్ల తర్వాత చేపడుతున్న ఈ రీసర్వేతో భూ రికార్డులను పక్కాగా డిజిటలైజ్ చేయాలన్నారు. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశమున్నందున సర్వేయర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రికార్డులు తారుమారు కాకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని సీఎం నిర్దేశించారు. భూరికార్డులు మార్చివేయడానికి అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.
మూడు దశల్లో సర్వే