ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐఐటీటీయం విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభం - నెల్లూరు జిల్లా వార్తలు

ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ..ఈ ఏడాదికి చెందిన అడ్మిషన్లను ప్రారంభించింది. భారత పర్యటక మంత్రిత్వ శాఖ స్థాపించిన విద్యా సంస్థలు గ్వాలియర్ ,భవనేశ్వర్,నోయిడా, నెల్లూరులలో ఉన్నాయని తెలిపింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ , పీజీ ప్రవేశాలకు అడ్మిషన్ ప్రక్రియ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపింది.

Institute Of Tourism in ap
Institute Of Tourism in ap

By

Published : Oct 23, 2020, 4:36 PM IST

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటియం), నెల్లూరు, పర్యటక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ..ఈ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభించింది. అడ్మిషన్ కమిటీ కన్వీనర్ సంజీవ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. పర్యటక రంగాన్ని జీవనోపాధిగా మలుచుకోవాలనుకునే ఔత్సాహికులు... భారత పర్యటక మంత్రిత్వ శాఖ స్థాపించిన ఈ విద్యా సంస్థలు గ్వాలియర్ , భవనేశ్వర్, నోయిడా, నెల్లూరులలో ఉన్నాయని తెలిపారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ ప్రవేశాలకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అడ్మిషన్​ల కోసం, మరిన్ని వివరాలకు తమ అధికారిక వెబ్ సైట్ www.iittmsouth.org ను సందర్శించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం

ABOUT THE AUTHOR

...view details