ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2021, 9:54 PM IST

ETV Bharat / city

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై రేపటికల్లా వివరాలు ఇవ్వాలన్న ధర్మాసనం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ... దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొందరికి బిల్లులు చెల్లించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఏ కేసులో ఎంత డబ్బు చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలో పూర్తి వివరాలు రేపటికి ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details