ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 6, 2021, 12:10 AM IST

Updated : Sep 6, 2021, 5:04 AM IST

ETV Bharat / city

telangana:విమానం బాత్‌రూమ్‌లో భారీగా బంగారం

దుబాయ్ నుంచి వస్తున్న విమానం తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేయగా.. బాత్‌రూమ్‌లో అక్రమ బంగారం బయటపడింది.

flight
విమానం

దుబాయ్ నుంచి వస్తున్న విమానం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఇండిగో విమానంలో బాత్‌రూమ్ లాక్‌చేసి ఉండటమే ల్యాండింగ్​కు కారణమని సమాచారం. విమానం ల్యాండింగ్ చేసిన అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేశారు. విమానంలోని బాత్‌రూమ్‌లో 350 గ్రాముల అక్రమ బంగారం బయటపడింది. బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అప్పగించారు.

Last Updated : Sep 6, 2021, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details