ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హరిద్వార్​లో నిరాడంబరంగా పవన్ బస - జనసేన అధినేత బస

హరిద్వార్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ చిన్న గదిలో బస చేస్తున్నారు. ఒక కుర్చీ, మంచం, ఫ్యాన్ మాత్రమే ఉన్న గదిలో ఆయన రెండు రోజులుగా ఉంటున్నారు.

పవన్

By

Published : Oct 12, 2019, 6:38 AM IST

గంగా నది చెంత జనసేన అధినేత

నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడే పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిద్వార్​లోనూ అదే చేస్తున్నారు. సాదాసీదాగా ఉండే ఒక ఆశ్రమంలో ఆయన రెండు రోజులు ఉన్నారు. జనసేన అధినేత బస చేసిన ఆశ్రమం, అందులో ఆయన ఉంటున్న గదిని చూస్తే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఒక కుర్చీ , ఒక మంచం మాత్రమే ఉన్న ఆ గదిలోని ఉన్నాయి. ఇక్కడే ఆయన శనివారం కూడా ఉంటారు. దీనికి సంబంధించిన చిత్రాలను జనసేన పార్టీ ట్విటర్​లో పోస్ట్ చేసింది.

గంగానది చెంత పవన్

పుణ్యక్షేత్రమైన రిషికేశ్​లో పవిత్ర గంగా నదిని శుక్రవారం పవన్ సందర్శించారు. తొలుత రిషికేశ్​లోని గంగా బ్యారేజ్ చేరుకుని అక్కడ గంగా నది ప్రవాహ ఝురిని, ఒరవడిని ఆసక్తిగా తిలకించారు. హిమాలయ సాణువుల్లో ఉద్భవించే గంగా నది అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ రిషికేశ్​కు చేరుకునే వైనాన్ని ప్రొఫెసర్ విక్రం సోని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ వివరించారు. గంగా నీటిలో 42 రకాల ఔషద లక్షణాలు ఉన్నాయని వివరించారు. ప్రధాన కాలువ మార్గమంతా దట్టమైన అడవితో నిండి ఉంది. అటవీ మార్గం మధ్యలో చిల్లా అనే ప్రాంతంలో ఆగి కాసేపు గంగా కాలువ ఒడ్డున కూర్చుని తదేకంగా గంగను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి హరిద్వార్ చేరుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాత్రి ఆశ్రమానికి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details