దిల్లీ నుంచి ప్రధాని మోదీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. అమరావతి నుంచి ఏపీ ఇంఛార్జ్ సీఎస్ నీరబ్కుమార్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రాజెక్టులు, పురోగతిపై వివరించారు. సంప్రదాయేతర ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న 8 రాష్ట్రాల్లో.. అమలవుతున్న ప్రాజెక్టులు, పురోగతితో పాటు వెనుకబడిన జిల్లాలు, వ్యవసాయం, సహకార రంగం, రైతు సంక్షేమం, వ్యవసాయ మార్కెట్లు, ఇ-నామ్ లపై ప్రధాని మోదీ సమీక్షించారు.
ప్రధాని మోదీ సమీక్షకు.. ఇంఛార్జ్ సీఎస్ హాజరు - ఏపీ ఇంఛార్జ్ సీఎస్ తాజా వార్తలు
రాష్ట్ర ఇంఛార్జ్ సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు తీసుకున్న అనంతరం.. కీలకమైన సమీక్షకు హాజరయ్యారు. దిల్లీ నుంచి ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన పాల్గొన్నారు.
in-charge-cs-attend-pm-video-conference