ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 21, 2019, 8:03 AM IST

Updated : Oct 21, 2019, 12:53 PM IST

ETV Bharat / city

తెలంగాణ.. హుజూర్​నగర్​లో కొనసాగుతున్న పోలింగ్

తెలంగాణలోని హుజూర్​నగర్​లో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది.

హుజూర్​నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

తెలంగాణలోని హుజూర్​నగర్​లో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్​ సరళిని ఎస్పీ భాస్కరన్​ పరిశీలించారు.

పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్​ నిలిచిపోయింది. పాలకవీడు మండలం బెట్టెతండాలో... వీవీప్యాట్, బ్యాలెట్ అనుసంధానంలో సమస్య తలెత్తింది. అటు నేరేడుచర్ల మండలం చింత బండ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో... సమస్య ఎదురైంది. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో హుజూర్​నగర్​ ఉపఎన్నిక తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్​పి క్యాంపస్​లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హుజూర్​నగర్​ నియోజకవర్గంలో 79 పోలింగ్​ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 540 మంది సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, 400 మంది టీఎస్​ఎస్పీ దళ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది సిబ్బంది పోలింగ్​ విధులు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్​ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్, యాక్ట్​ 30 అమల్లో ఉంది.

Last Updated : Oct 21, 2019, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details