ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 25, 2019, 4:49 PM IST

ETV Bharat / city

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆగదు: హోంమంత్రి

పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 90శాతం అమలు చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

home minister sucharitha comments on rtc murger in governament

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆగదు: హోంమంత్రి

పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ 90 శాతం అమలు చేస్తున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమావేశానికి హాజరైన హోంమంత్రి.. విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లపట్టాలు అందిస్తామని.. అందులో విశ్రాంత ఆర్టీసీ కార్మికులకు ఇళ్ల పట్టాలిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details