ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2019, 11:01 AM IST

Updated : Dec 6, 2019, 11:19 AM IST

ETV Bharat / city

సంభవామి యుగేయుగే : హోమంత్రి సుచరిత

దిశ అత్యాచార నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. దిశ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని అన్నారు. దిశకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

home minister respond on disha accused encounter
దిశ మృగాళ్ల ఎన్​కౌంటర్​పై హోంమంత్రి స్పందన

హోం మంత్రి ట్విట్టర్ పోస్టు

దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. నిందితుల ఎన్​కౌంటర్​పై ఆమె స్పందించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడం వల్ల పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని ఉద్ఘాటించారు. ఇటువంటి సంఘటనల వల్లే దిశ లాంటి ఉదంతాలు పునరావృతం కావని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు పుడుతుంటాడని 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే'
అనే భగవద్గీత శ్లోకాన్ని ట్విట్టర్​ ఖాతాలో పోస్టు చేశారు.

Last Updated : Dec 6, 2019, 11:19 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details