ఫిబ్రవరి పదో తేదీన సచివాలయంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశం జరగనుంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన ఈ హెచ్ఓడీల సమావేశాన్ని నిర్వహించనున్నారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై సీఎస్ ఈ భేటీలో సమీక్షించనున్నారు.
ఈనెల 10న సీఎస్ అధ్యక్షతన హెచ్ఓడీల సమావేశం - ap cs meet on nadu-nedu works
ఈ నెల 10న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశం జరగనుంది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై సీఎస్ సమీక్షించనున్నారు.

సీఎస్ అధ్యక్షతన హెచ్ఓడీల సమావేశం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో తొలిసారి ఈ హెచ్ఓడీల సమావేశం జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. గడచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో హెచ్ఓడీల సమావేశం జరక్కపోవటంతో ఈ భేటీ కీలకంగా మారింది.
ఇదీ చదవండి: ఈ-వాచ్ యాప్ వాడకంలోకి తేవద్దు: హైకోర్టు