ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగు ప్రజలకు హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ సంక్రాంతి శుభాకాంక్షలు

By

Published : Jan 12, 2021, 10:58 AM IST

Updated : Jan 12, 2021, 12:16 PM IST

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో పర్యటిస్తున్న దత్తాత్రేయను.. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్.. మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపట్లో.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన్ను కలవనున్నారు. అంతకుముందు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దత్తాత్రేయ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ
హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ను కలవనున్న సీఎం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడలో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం.. ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ మర్యాదలతో దత్తాత్రేయకు మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేశ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. తెలుగు ప్రజలకు దత్తాత్రేయ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. 2020లో కరోనా యావత్‌ ప్రపంచాన్ని కరోనా ఇబ్బందికి గురిచేసిందని అన్నారు.

హిమాచల్ గవర్నర్ ను.. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించారు. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ సైతం.. దత్తాత్రేయను కలవనున్నారు.

Last Updated : Jan 12, 2021, 12:16 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details